Friday, August 16, 2013

67 వ స్వాతంత్ర దినోత్స్తవము


  • మహర్షులు ఈ కర్మభూమి ఫై చేసిన తపస్సు ఫలితమా అన్నట్లు నీతి ,న్యాయం ,ధర్మం ,నిజాయితి ,సత్యం అనే పంచేంద్రియాలతో "వేదభూమి " జనియించినది . 
  • నడక ప్రారంభించిన తరుణములో ఋగ్వేద ,యజుర్వేద,సామవేద,అధర్వణ వేదములనెడి  నాలుగు కాళ్ళ ఆసరాతో కదలాడుతూ ప్రపంచాన్ని చూడ ఆరంభించెను . 
  • జీవనాధారమైన గాలి,నింగి,నేల , నీరు,నిప్పు అనెడి పంచభూతములకు అంజలి ఘటిస్తూ ,ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుకి   "ఆదిత్య హృదయముతో " కృతజ్ఞతలు తెల్పుతూ ఉదయాన్ని ఆరంభించెను . 
  • తన ముంగిట్లో నడయాడిన ఎందరో పుణ్య మూర్తుల గాధలను "రామాయణ ,మహాభారత,భాగవత రూపములొ ప్రతి దినం పటిస్తూ పరవసించిపొయెది . 
  • "తమసోమా జ్యోతిర్గమయ " అని భక్తి భావనలో భగవంతుని ఆరాధిస్తూ తన్మయత్వంతో తనువు ,మనసు పరమాత్మఫై లగ్నం చేసి పులకరించిపోయేది . 
  • "ధర్మో రక్షిత రక్షః "అనే సిద్దాంతములను కట్టుబాటుగా దైనందిన జీవనములో అలవరచుకొని తీరం దాటని ప్రవాహములా నీతివంత జీవనాన్ని కొనసాగించెను . 
  • వర్తక సంబంధాల కోసం తన ఇంటికి వస్తున్న  పరాయి దేశస్తులను "ఆతిథి దేవోభవ " అన్నట్లు సొంత మిత్రులుగా భావించి ఆదరించెను. 
  • విభిన్న సాంప్రదాయాలను,సంస్కృతులను ,ఆచారాలను అగౌరవ పరచక ఆచరించేవారి మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తపడెను . 
  • దేశ భాషలు వేరు అయినా స్నేహభావంతో తన గడ్డఫై కాలుమోపిన "అరబ్భులు,పర్షియన్లు ,పోర్చుగీసు ,గ్రీసు ,బ్రిటిషర్లు ఇలా ప్రతి ఒక్కరికి ఆతిద్యమిచ్చిను   . 
  • కాలం మారి " ఓడలు బండ్లు అయినట్లు " ఆతిద్యమిచ్చిన  మనమే బ్రితిషర్లుకు బానిసలుగా రెండు శతాబ్దాలు బ్రతుకవలసినా ఓర్పుతో సహించింది . 
  • ప్రపంచానికి అహింసావాదంలోని గొప్పతనాన్ని చాటిచెపుతూ బ్రిటిషర్ల చెర నుండి విముక్తి పొంది స్వాతంత్రం పొందినది . 
  • సంపదలు కొల్లగొట్టుకు పోయినా ప్రజలే సంపదలుగా రాజ్యాంగాన్ని స్థాపించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించెను . 
  • కాషాయం -త్యాగానికి ,ఆకుపచ్చ -సస్యశ్యామలకు ,తెలుపు-శాంతికి ,నీలి రంగు అశోకుని చక్రము-ధర్మమునకు నిదర్సనముగా ఈ విలువలు అనే వలువలను ధరించి వినువీధిలో రెపరెపలాడింది  . 
  • గడచిన కాలంలో గర్వముగా చాటిన సందర్భాలు వున్నాయి అలానే గుండెలు చెదరిన సందర్భములు వున్నాయి .. ఈ ఎత్తుపల్లాలను ఆనందముగా స్వీకరించి అలుపెరుగని ప్రయాణము చేస్తూనే వున్నది నా భారతావని .  
అమెరికాని కోలంబస్ కనుగొన్న ఆధారం వుంది కాని ఈ సప్తర్హులు నడయాడిన పుణ్యభూమి ఎప్పుడు ఉద్బవించినదో సాక్షము లేదు .. ఎన్నో తరాల చరిత్ర పునాదులుగా నిర్మితమయిన ఈ జంభుద్వీపం వొంటిఫై రెండు శతాబ్దాల బానిస బ్రతుకు మాత్రం నల్లని మచ్చగా మిగిలి పోయింది . ఈ చెర  నుండి విముక్తి అయి 67 వసంతాలు దాటినా శుభ సందర్భమున అందరికి మనస్పూర్తిగా  స్వాతంత్ర దినోత్స్తవ శుభాకాంక్షలు తెల్పుచున్నాను . 

                                            ........  జై హింద్  ........